Share News

AP BJP: ఏపీ బీజేపీలోకి భారీగా చేరికలు

ABN , Publish Date - Mar 16 , 2024 | 07:31 PM

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో బీజేపీ(BJP) పార్టీ చేరికలపై దృష్టి సారించింది. పలు పార్టీల్లోని నేతలను బీజేపీ తమ పార్టీలో చేర్చుకునేలా ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లా, అనంతపురం జిల్లాల నుంచి వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు బీజేపీలో చేరారు.

AP BJP: ఏపీ బీజేపీలోకి భారీగా చేరికలు

విజయవాడ: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో బీజేపీ (BJP) పార్టీ చేరికలపై దృష్టి సారించింది. పలు పార్టీల్లోని నేతలను బీజేపీ తమ పార్టీలో చేర్చుకునేలా ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లా, అనంతపురం జిల్లాల నుంచి వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు బీజేపీలో చేరారు. ఆయా నేతలకు రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ థావడే కాషాయం కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

బీజేపీలో చేరిన వారిలో రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ ముళ్లపూడి రేణుక, డాక్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ దంపతులు ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా కాకాని వెంకటరత్నం నాయుడు మనవడు తరుణ్ కాకాని. కాకినాడకు చెందిన కాంగ్రెస్ నాయకులు సబ్బిళ్ల గంగిరెడ్డి ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా సిరి పురపు తేజేశ్వర్‌రావు, వైసీపీ చెందిన పైడి రాజారావు, వైసీపీ మండల అధ్యక్షుడు పోలేపల్లి ప్రసాద్ బీజేపీలో చేరారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 16 , 2024 | 07:56 PM