Share News

Sharmila: ముహూర్తం ఫిక్స్.. ఉదయం 10.30 గంటలకు కాంగ్రెస్‌లో చేరనున్న షర్మిల

ABN , Publish Date - Jan 04 , 2024 | 08:27 AM

న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె.. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. గురువారం ఉదయం 10.30 గంటలకు ఆమె కాంగ్రెస్‌లో చేరనున్నారు.

Sharmila: ముహూర్తం ఫిక్స్.. ఉదయం 10.30 గంటలకు కాంగ్రెస్‌లో చేరనున్న షర్మిల

న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె.. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. గురువారం ఉదయం 10.30 గంటలకు ఆమె కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారు. కాగా షర్మిల తన భర్త అనిల్‌తో కలిసి బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు.

రాష్ట్ర సారథ్యం అప్పగించేందుకే రాహుల్‌ మొగ్గు!

కాంగ్రెస్‌లో చేరుతున్న షర్మిలకు ఆంధ్ర పీసీసీ పగ్గాలు అప్పగించేందుకే రాహుల్‌ మొగ్గు చూపుతున్నారు. ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర నేతలతో జరిగిన సమావేశంలో.. ఆయన, మల్లికార్జునఖర్గే ప్రత్యేకంగా షర్మిల ప్రస్తావన తీసుకొచ్చారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు మాజీ ఎంపీలు తప్ప ఆమె రాకను అందరూ స్వాగతించారు. పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుండగా.. రాహుల్‌ జోక్యం చేసుకుని.. రాష్ట్ర కాంగ్రెస్‌లో షర్మిలకు ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.

Updated Date - Jan 04 , 2024 | 08:27 AM