Share News

YCP: ప్రజాక్షేమాన్ని కాంక్షిచేవాళ్లే రాజకీయ పార్టీ పెట్టాలి: మంత్రి చెల్లుబోయిన

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:48 PM

అమరావతి: ప్రజాక్షేమాన్ని కాంక్షిచేవాళ్లే రాజకీయ పార్టీ పెట్టాలని.. మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టి రాష్ట్రానికి అన్యాయం చేసారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ విమర్శించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ..

YCP:  ప్రజాక్షేమాన్ని కాంక్షిచేవాళ్లే రాజకీయ పార్టీ పెట్టాలి: మంత్రి చెల్లుబోయిన

అమరావతి: ప్రజాక్షేమాన్ని కాంక్షిచేవాళ్లే రాజకీయ పార్టీ పెట్టాలని.. మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టి రాష్ట్రానికి అన్యాయం చేసారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ విమర్శించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. తప్పు సరిదిద్దుకొనేందుకే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టారనుకొన్నామని, కానీ చంద్రబాబు కోసం పార్టీ పెట్టారన్న విషయం బయటపడుతోందన్నారు. నారా లోకేష్ అవినీతి పరుడని మాట్లాడిన పవన్ ఇప్పుడు అంటకాగుతున్నారని ఆరోపించారు. ప్రజాసంక్షేమం అందించటంలో సీఎం వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారన్నారు. పేదరిక నిర్ములనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని కొనియాడారు. ఎన్టీఆర్ కుటుంబానికి ద్రోహం చేసిన చంద్రబాబుకు పవన్ వంతపాడుతున్నారని విమర్శించారు. పేదలకు సాయం చేస్తున్న వైఎస్ జగన్‌ను ఓడిస్తానని ప్రగల్బాలు పలుకుతున్నారని, పవన్ కళ్యాణ్ అసహాయ రాజకీయ నాయకుడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వ్యాఖ్యానించారు.

Updated Date - Feb 06 , 2024 | 12:48 PM