Share News

AP NEWS: ఎన్టీఆర్ జిల్లాలో మద్యం మత్తులో గొంతు కోసుకున్న వ్యక్తి

ABN , Publish Date - Feb 16 , 2024 | 10:41 PM

మద్యం మత్తులో ఓ వ్యక్తి తన గొంతును తానే కోసుకున్నాడు. ఈ సంఘటన జిల్లాలోని ఏ.కొండూరు మండలం అట్ల ప్రగడ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి మద్యం మత్తులో బోరుబావికి తలబాదుకొని చాకుతో తన మెడను కోసుకున్నాడు.

AP NEWS: ఎన్టీఆర్ జిల్లాలో మద్యం మత్తులో గొంతు కోసుకున్న వ్యక్తి

ఎన్టీఆర్ జిల్లా: మద్యం మత్తులో ఓ వ్యక్తి తన గొంతును తానే కోసుకున్నాడు. ఈ సంఘటన జిల్లాలోని ఏ.కొండూరు మండలం అట్ల ప్రగడ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి మద్యం మత్తులో బోరుబావికి తలబాదుకొని చాకుతో తన మెడను కోసుకున్నాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం 108లో తిరువూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెనుగంచిప్రోలు మండలంలోని గట్టు భీమవరానికి చెందిన అల్లూరి శ్రీనివాస్‌కు తొమ్మిదేళ్ల క్రితం ఏ.కొండూరు మండలంలోని అట్లప్రగడ గ్రామానికి చెందిన గొల్లపూడి కృష్ణవేణితో వివాహం జరిగింది.

అయితే కొన్నేళ్లు వీరు అన్యోన్యంగా జీవించారు. ఆ తర్వాత భార్య భర్తల మధ్య మనస్పర్థలు రావటంతో కూతురుతో కలసి భార్య కృష్ణవేణి పుట్టింటికి వచ్చింది. అట్లప్రగడ వచ్చిన భర్త శ్రీనివాస్ మద్యం మత్తులో తన కూతురినీ పంపించమని భర్త శ్రీనివాస్ గొడవ చేశాడు. గ్రామంలో కొట్టుడు బోరుకు తల బాదుకొని చాకుతో మెడ కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Feb 16 , 2024 | 10:41 PM