Share News

Kollu Ravindra: టీడీపీ అధికారంలోకి రాగానే స్వర్ణకారులకు సువర్ణ అవకాశాలు కల్పిస్తాం

ABN , Publish Date - Feb 21 , 2024 | 01:21 PM

మచిలీపట్నంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా విశ్వబ్రాహ్మణ కాలనీలో స్వర్ణకారుల కార్యశాలను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. స్థానికంగా స్వర్ణకారులు తెలిపిన సమస్యలపై స్పందిస్తూ.. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్వర్ణకారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.

Kollu Ravindra: టీడీపీ అధికారంలోకి రాగానే స్వర్ణకారులకు సువర్ణ అవకాశాలు కల్పిస్తాం

మచిలీపట్నం: మచిలీపట్నంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా విశ్వబ్రాహ్మణ కాలనీలో స్వర్ణకారుల కార్యశాలను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) సందర్శించారు. స్థానికంగా స్వర్ణకారులు తెలిపిన సమస్యలపై స్పందిస్తూ.. తెలుగుదేశం (TDP), జనసేన (Janasena) ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్వర్ణకారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.

స్వర్ణకారులకు సువర్ణ అవకాశాలు కల్పిస్తామని కొల్లు రవీంద్ర. స్వర్ణకారులకు సాంకేతికతను జోడించి వ్యాపార అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామన్నారు. నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక తర్ఫీదు ఇప్పించి మార్కెట్లో పోటీకి దీటుగా అవకాశాలు కల్పిస్తామన్నారు. చేతివృత్తులను కులవృత్తులను తెలుగుదేశం పార్టీ మొదటి ప్రాధాన్యతగా తీసుకుని అవకాశాలు కల్పించి అభివృద్ధి పరుస్తామని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

Updated Date - Feb 21 , 2024 | 01:21 PM