Indian Railways : రాయ్పూర్ డీఆర్ఎంగా సాంబశివరావు
ABN , Publish Date - Dec 27 , 2024 | 04:25 AM
ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ పరిధిలోని రాయ్పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం)గా కోగంటి సాంబశివరావును నియమించారు.
అమరావతి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ పరిధిలోని రాయ్పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం)గా కోగంటి సాంబశివరావును నియమించారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే ఐఆర్టీఎ్సలో పనిచేస్తున్న సాంబశివరావును రాయ్పూర్ డీఆర్ఎంగా బదిలీ చేస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. కాగా, సాంబశివరావు గతంలో రాష్ట్ర ఫైబర్నెట్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు.