Share News

AP News: చంద్రబాబును కలిసిన కోడికత్తి శ్రీను కుటుంబం.. కారణమిదే..?

ABN , Publish Date - Apr 12 , 2024 | 11:09 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేటలో ప్రజాగళం బహిరంగ సభకు విచ్చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ను అడ్వకేట్‌ గుణ్ణం వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో జనుపల్లి శ్రీనివాస్‌ అలియాస్‌ కోడికత్తి శ్రీను కుటుంబం గురువారం కలిసింది.

AP News: చంద్రబాబును కలిసిన కోడికత్తి శ్రీను కుటుంబం.. కారణమిదే..?

అంబాజీపేట/పి.గన్నవరం, ఏప్రిల్‌ 11: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేటలో ప్రజాగళం బహిరంగ సభకు విచ్చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు (Chandrababu Naidu)ను అడ్వకేట్‌ గుణ్ణం వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో జనుపల్లి శ్రీనివాస్‌ అలియాస్‌ కోడికత్తి శ్రీను కుటుంబం గురువారం కలిసింది. హెలిపాడ్‌ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో చంద్రబాబును కలిసి తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వివరించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారని కోడికత్తి శ్రీను తల్లి సావిత్రి ఈ సందర్భంగా తెలిపారు. కోనసీమలోని పలు సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లానని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పినట్టు శ్రీను వివరించాడు. ఈ ఎన్నికల్లో తమ కుటుంబం టీడీపీకి మద్దతుగా ఉంటుందని శ్రీను సోదరుడు సుబ్బరాజు స్పష్టం చేశాడు. వారి వెంట అడ్వకేట్లు కె.సునీల్‌కుమార్‌, కె.ధనరాజు ఉన్నారు.

Bheesetty Babji: రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చిన జగన్‌

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 12 , 2024 | 11:44 AM