Share News

AP Politics: పెడన నియోజకవర్గంలో వేదవ్యాస్ నివాసానికి టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్

ABN , Publish Date - Feb 26 , 2024 | 04:30 PM

తాజాగా పెడన నియోజకవర్గం టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్‌ను తొలి జాబితాలో సీటు దక్కించుకున్న అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్ కలిశారు. వేదవ్యాస్ నివాసానికి వెళ్లి మాట్లాడారు. చంద్రబాబు మంచే చేస్తారని వేదవ్యాస్‌కు కృష్ణ ప్రసాద్ నచ్చచెప్పారు. కలిసి పని చేసి టీడీపీని విజేతగానిలపాలని కోరారు. దీనికి వేదవ్యాస్ సానుకూలంగా స్పందించారు. జాగ్రత్తగా పని చేసుకోవాలంటూ కాగితకు సూచనలు చేశారు.

AP Politics: పెడన నియోజకవర్గంలో వేదవ్యాస్ నివాసానికి టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్

అమరావతి: టీడీపీ మొదటి జాబితాలో (TDP first list) తమ పేర్లు లేకపోవడంతో టికెట్ ఆశించి భంగపాటుకు గురైన పలువురు నేతలు అలకబూనారు. అసంతృప్తికి గురయ్యారు. అయితే టికెట్ దక్కినవారు రంగంలోకి దిగి అందరినీ కలుపుకొని పోవాలని, టికెట్ ఆశించి భంగపడ్డ వారిని స్వయంగా కలిసి సమన్వయం చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచన చేసిన నేపథ్యంలో అభ్యర్థులు రంగంలోకి దిగారు. తాజాగా పెడన నియోజకవర్గం టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్‌ను తొలి జాబితాలో సీటు దక్కించుకున్న అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్ కలిశారు. వేదవ్యాస్ నివాసానికి వెళ్లి మాట్లాడారు.

చంద్రబాబు మంచే చేస్తారని వేదవ్యాస్‌కు కృష్ణ ప్రసాద్ నచ్చచెప్పారు. కలిసి పని చేసి టీడీపీని విజేతగానిలపాలని కోరారు. దీనికి వేదవ్యాస్ సానుకూలంగా స్పందించారు. జాగ్రత్తగా పని చేసుకోవాలంటూ కాగితకు సూచనలు చేశారు. కాగా ఇటీవల ప్రకటించిన టీడీపీ తొలి జాబితాలో వేదవ్యాస్‌కు టికెట్ లభించలేదు. పెడన నియోజకవర్గం నుంచి కాగితపు కృష్ణప్రసాద్ పేరుని ప్రకటించడంతో వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తికి గురైన విషయం తెలిసిందే.

Updated Date - Feb 26 , 2024 | 04:30 PM