Share News

Chandrababu: అయోధ్యకు రండి.. చంద్రబాబుకు ఆహ్వానం

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:27 PM

Andhrapradesh: అయోధ్య రామాలయంలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాల్సిందిగా ఇప్పటికే అనేక మంది ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. ఇప్పుడు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా ఆయోధ్యకు రావాలని ఆహ్వానం వచ్చింది.

Chandrababu: అయోధ్యకు రండి.. చంద్రబాబుకు ఆహ్వానం

అమరావతి, జనవరి 17: అయోధ్య రామాలయంలో (Ayodhya Ram Temple) శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాల్సిందిగా ఇప్పటికే అనేక మంది ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. ఇప్పుడు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా అయోధ్యకు రావాలని ఆహ్వానం వచ్చింది. ఈనెల 22న అయోధ్య రామజన్మభూమి దేవాలయంలో ప్రాణప్రతిష్ట వేడుక జరుగనుంది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా చంద్రబాబుకు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు ఆహ్వానం అందించారు.


మరోవైపు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ఈనెల 16 నుంచి ప్రారంభమయ్యాయి. 16 నుంచి 21 వరకు ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు జరగనున్నాయి. జనవరి 18న ఆలయ గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. 22వ తేదీ మధ్నాహ్నం 12:20 గంటలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మొదలుకానుంది. మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనుంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 17 , 2024 | 01:10 PM