Share News

Guntur: టీడీపీ జెండాను తగలబెట్టిన వైసీపీ కార్యకర్తలు

ABN , Publish Date - Feb 11 , 2024 | 12:58 PM

గుంటూరు జిల్లా: పొన్నూరు మండలం, పచ్చలతాడిపర్రులో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక బస్సు షెల్టర్ వద్ద టీడీపీ జెండాను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. దీంతో దోషులను శిక్షించాలంటూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. గతంలో ఇదే బస్సు షెల్టర్ వద్ద ఉన్న టీడీపీ జెండా దిమ్మెను కూల్చివేశారని మండిపడ్డారు.

Guntur: టీడీపీ జెండాను తగలబెట్టిన వైసీపీ కార్యకర్తలు

గుంటూరు జిల్లా: పొన్నూరు మండలం, పచ్చలతాడిపర్రులో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక బస్సు షెల్టర్ వద్ద టీడీపీ జెండాను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. దీంతో దోషులను శిక్షించాలంటూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. గతంలో ఇదే బస్సు షెల్టర్ వద్ద ఉన్న టీడీపీ జెండా దిమ్మెను కూల్చివేశారని మండిపడ్డారు. ఇదంతా వైసీపీ నేతలే చేస్తున్నారని ఆరోపించారు. దోషులను కఠినంగా శిక్షించాలంటూ టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో పొన్నూరు, గుంటూరు రోడ్డు రహదారిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని టీడీపీ నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గతంలో జెండా దిమ్మెను కూల్చివేసినప్పుడు పోలీసులు చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదికాదని, పోలీసులు నిర్లక్ష్యం వలనే టీడీపీ జెండా తగులబెట్టే పరిస్థితి ఏర్పడిందంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ జెండాను తగులబెట్టిన వైసీపీ శ్రేణులను అరెస్టు చేసేవరకు తాము ధర్నా విరమించబోమని పోలీసులకు టీడీపీ నేతలు స్పష్టం చేశారు. గత రాత్రి ఈ ఘటన జరిగింది.

Updated Date - Feb 11 , 2024 | 12:58 PM