Vijayasai Reddy: ఎమ్మెల్యే సుధాకర్ బాబు విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తాం
ABN , Publish Date - Jan 12 , 2024 | 10:35 PM
ఎమ్మెల్యే TJR సుధాకర్ బాబుపై పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్ ( CM JAGAN ) దృష్టికి తీసుకోని వెళ్తామని వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy )తెలిపారు.

ప్రకాశం: ఎమ్మెల్యే TJR సుధాకర్ బాబుపై పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్ ( CM JAGAN ) దృష్టికి తీసుకోని వెళ్తామని వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy )తెలిపారు. శుక్రవారం నాడు వైసీపీ కార్యాలయంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సంతనుతలపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే TJR సుధాకర్ బాబు మేరుగ నాగార్జున పరిచయ కార్యక్రమానికి హాజరుకాకపోవడాన్ని క్రమశిక్షణ చర్యలు కింద భావిస్తున్నామన్నారు. ఈ రోజు పరిచయ కార్యక్రమం ఉందని ఎమ్మెల్యే TJR సుధాకర్ బాబుకి తెలుసునని చెప్పారు. నిన్న కొన్ని కారణాల వల్ల కార్యక్రమానికి రావడం లేదని TJRమెసేజ్ చేశారన్నారు. ఎమ్మెల్యే TJR సుధాకర్ బాబుపై పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్ దృష్టికి తీసుకోని వెళ్తామన్నారు. సీఎం జగన్ని ప్రతి ప్రతిపక్ష నేతలు విమర్శిస్తే.. మనం తిరిగి ప్రతిపక్ష పార్టీ నేతలపై ప్రతి విమర్శలు చెయాలని చెప్పారు. ఎమ్మెల్యే TJRని సస్పెండ్ చెయ్యాలని కార్యకర్తలు నినాదాలు చేశారు.