Share News

Road Accident: గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి

ABN , Publish Date - Mar 13 , 2024 | 08:58 AM

గుంటూరు జిల్లా: మంగళగిరి మండలం ఆత్మకూరు బైపాస్ రోడ్డు వద్ద గత అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. మిర్చి బస్తాల లోడుతో వస్తున్న ఆటో.. రోడ్డు పక్కనే ఉన్న వారిపైకి దూసుకెళ్లి.. పక్కనే ఉన్న నేల బావిలో ఆటో పడిపోయింది.

Road Accident: గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి

గుంటూరు జిల్లా: మంగళగిరి మండలం ఆత్మకూరు బైపాస్ రోడ్డు (Atmakuru Bypass Road) వద్ద గత అర్ధరాత్రి (Midnight) ప్రమాదం (Road Accident) జరిగింది. మిర్చి బస్తాల లోడుతో వస్తున్న ఆటో (Auto).. అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వారిపైకి దూసుకెళ్లి.. పక్కనే ఉన్న నేల బావిలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్తాప్తు చేపట్టారు. నీటిలో తేలియాడుతున్న మిర్చి బస్తాలు, ఆటోను క్రేన్ సాయంతో ఆటోను బయటకు తీసారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Mar 13 , 2024 | 08:58 AM