Minister Dharmana: ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ గురించి ఆందోళన వద్దు
ABN , Publish Date - Jan 09 , 2024 | 06:04 PM
ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ గురించి పూర్తిగా తెలియనందున పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు ( Minister Dharmana Prasada Rao ) తెలిపారు. మంగళవారం నాడు తన కార్యాలయంలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. భూ వివాదాలు లేకుండా చేయాలనే ప్రభుత్వం ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ తీసుకువస్తున్నట్లు మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.
![Minister Dharmana: ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ గురించి ఆందోళన వద్దు](https://media.andhrajyothy.com/media/2023/20231205/Dharmana_Prasad_Rao_a22b3252b5.jpg)
అమరావతి: ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ గురించి పూర్తిగా తెలియనందున పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు ( Minister Dharmana Prasada Rao ) తెలిపారు. మంగళవారం నాడు తన కార్యాలయంలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. భూ వివాదాలు లేకుండా చేయాలనే ప్రభుత్వం ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ తీసుకువస్తున్నట్లు తెలిపారు. సర్వే పూర్తి అయిన తర్వాత... రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ అయిన తర్వాతే చట్టం అమలు జరుగుతుందని.. అప్పుడు నోటీఫై చేస్తామని తెలిపారు. స్టేక్ హోల్డర్స్ ఇచ్చిన అభిప్రాయాలను తీసుకొని రూల్స్ తెస్తామన్నారు. ఇదివరకే దీనిపై పలు పిల్స్ హైకోర్టులో పడ్డాయన్నారు. హైకోర్టు ఇచ్చే డైరెక్షన్స్ కూడా అమలు చేస్తామని తెలిపారు. విశాల ప్రయోజనాల దృష్ట్యా అందరి అభిప్రాయాలను గౌరవిస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.