Share News

Sri Krishna Devarayalu: టీడీపీలో చేరనున్న లావు శ్రీ కృష్ణదేవరాయలు

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:26 PM

పల్నాడు జిల్లా: పల్నాడులో కీలక నేత, నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మార్చి 2వ తేదీన (శనివారం) తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆ రోజు గురజాలలో జరిగే ‘రా కదలి రా’ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో చేరుతున్నట్లు తెలిపారు.

Sri Krishna Devarayalu: టీడీపీలో చేరనున్న లావు శ్రీ కృష్ణదేవరాయలు

పల్నాడు జిల్లా: పల్నాడు (Palnadu)లో కీలక నేత, నరసరావు పేట ఎంపీ (MP) లావు శ్రీకృష్ణదేవరాయలు (Lavu Sri Krishna Devarayalu) మార్చి 2వ తేదీన (శనివారం) తెలుగుదేశం పార్టీ (TDP)లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆ రోజు గురజాలలో జరిగే ‘రా కదలి రా’ (Ra Kadali Ra) సభలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సమక్షంలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా గురువారం ఆయన నరసరావుపేటలో మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, పల్నాడు అభివృద్ధికే తన ప్రతి అడుగు ఉంటుందన్నారు.

ఈ నెల 2వ తేదీన గురజాల వేదికగా జరగబోయే 'రా కదలి రా ' సభ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని శ్రీ కృష్ణదేవరాయలు పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమాన్ని, పల్నాడు అభివృద్ధికి కట్టుబడి మరలా నరసరావుపేట ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ, అభివృద్ధిని సాధించుటకే తన ప్రతి అడుగు, ఆలోచన ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో సాధించుకున్న వాటిని పూర్తి చేసుకోవటంతో పాటుగా రానున్న కాలంలో ఇంకొన్ని పల్నాడులో అభివృద్ధి కార్యక్రమాలు సాధించుకోవాలని, వాటికి కట్టుబడి సదా తోడుగా ఉంటానని మరలా ఆశీర్వదించాలని శ్రీ కృష్ణ దేవరాయలు పల్నాడు ప్రజనీకాన్ని కోరారు.

Updated Date - Feb 29 , 2024 | 01:14 PM