CM Jagan: ఆరోగ్యశ్రీపై ముమ్మరంగా ప్రచారం చేయాలి
ABN , Publish Date - Jan 12 , 2024 | 07:29 PM
ఆరోగ్యశ్రీ ( Aarogyasri ) వినియోగంపై ముమ్మరంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ( CM JAGAN ) ఆదేశించారు. శుక్రవారం నాడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

అమరావతి: ఆరోగ్యశ్రీ ( Aarogyasri ) వినియోగంపై ముమ్మరంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ( CM JAGAN ) ఆదేశించారు. శుక్రవారం నాడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. నిర్ణీత గడువులోగా ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా రూ.25 లక్షల వరకూ వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. నెట్ వర్క్ ఆస్పత్రులకు ఎలా వెళ్లాలన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలియాలని చెప్పారు. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి క్యాంపుల ద్వారా అవసరమైన వారికి వైద్యసేవలు అందించాలని సూచించారు. ప్రతి 6 నెలలకోసారి రికార్డులు అప్డేట్ చేయాలన్నారు. ఆరోగ్య సురక్ష క్యాంప్లపై సీరియస్గా దృష్టిపెట్టాలన్నారు. ప్రతి సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకుని డ్రైవ్ చేయాలని సూచించారు. నూతన మెడికల్ కాలేజీల్లో అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.