Share News

Guntur.. దేశంలో సమూల మార్పులు తీసుకొచ్చిన మోదీ: సత్య కుమార్

ABN , Publish Date - Jan 03 , 2024 | 09:21 AM

గుంటూరు జిల్లా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో సమూల మార్పులు తీసుకొచ్చారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల వివక్ష చూపించకుండా అనేక పథకాలు అందజేశారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ పేర్కొన్నారు.

Guntur.. దేశంలో సమూల మార్పులు తీసుకొచ్చిన మోదీ: సత్య కుమార్

గుంటూరు జిల్లా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో సమూల మార్పులు తీసుకొచ్చారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల వివక్ష చూపించకుండా అనేక పథకాలు అందజేశారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ఇస్తున్న పథకాలపై ఏపీ ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకొని చేస్తున్న పరిస్థితిని ప్రజలకు వివరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన అవినీతి ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. సీఎం అసమర్థమతను, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని ఎత్తి చూపుతామన్నారు. పొత్తుల కంటే ముందు ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నామని, వాలంటీర్, పోలీసులు లేకుండా బయటకు రాలేని పరిస్థితి నెలకొందని, ఎన్నికల ముందు మాయదారి మాటలు చెప్పారని, సీఎం జగన్ ప్రజల మద్యకు రాలేకపోతున్నారని సత్య కుమార్ విమర్శించారు.

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ.. చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజల మద్దతు కోరుతూ పాదయాత్ర చేస్తున్నామన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అవసరాన్ని ప్రజలకు వివరిస్తున్నామని, ప్రధాని మోదీ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు. గుంటూరు జిల్లా ప్రజలు కూడా మోదీ చేస్తున్న అభివృద్ధిని గమనించి అండగా ఉండాలని కోరుతున్నామని జయప్రకాష్ నారాయణ అన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 09:21 AM