Share News

LokSabha Elections: పెమ్మసాని ఆస్తులు.. ఆసక్తికర చర్చ

ABN , Publish Date - Apr 22 , 2024 | 07:15 PM

గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ బరిలో దిగారు. తాజాగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఆ సందర్భంగా ఆయన.. తన ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్‌ను సైతం అందులో పొందు పరిచారు. అయితే ఆయన ఆస్తులపై ఆశ్చర్యకరమైన చర్చ నడుస్తుంది. తనకు రూ. 5,700 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.

LokSabha Elections: పెమ్మసాని ఆస్తులు.. ఆసక్తికర చర్చ
Pemmasani Chandrasekhar

గుంటూరు జిల్లా, ఏప్రిల్ 22: గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ బరిలో దిగారు. తాజాగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఆ సందర్భంగా ఆయన.. తన ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్‌ను సైతం అందులో పొందు పరిచారు. అయితే ఆయన ఆస్తులపై ఆశ్చర్యకరమైన చర్చ నడుస్తుంది. తనకు రూ. 5,700 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.

LokSabha Elections 2024: జయహో పాటకు.. శశిథరూర్ స్టెపులు

అందులో చరాస్తి విలువ రూ.2,316 కోట్లు తన పేర ఉంటే.. తన భార్య శ్రీరత్న పేరిట రూ.2,289 కోట్లు ఉన్నాయన్నారు. అలాగే తనతోపాటు తన భార్యకు సైతం సమానంగా అప్పులు ఉన్నాయని.. అంటే తనకు రూ.519 కోట్లు, భార్య శ్రీరత్న పేరిట రూ. 519 కోట్లు అప్పులు ఉన్నాయని వివరించారు. ఇక జేపీఎం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పెమ్మసాని పేరిట రూ.1200 కోట్ల విలువైన షేర్లు ఉంటే.. తన భార్య పేరిట కూడా రూ. 1200 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని పేర్కొన్నారు.

AP Elections : మహిళలకు ఫ్రీ బస్.. అదిరిందిగా..


AP Election 2024: ఎన్ఆర్ఐలను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తున్న వైసీపీ: కోమటి జయరాం

తమకు రెండు మెర్సిడైజ్ బెంజ్, టెస్లా, రోల్స్ రాయిస్, టయోటా పార్చుర్ కార్లు ఉన్నాయని వివరించారు. వీటి విలువ రూ.6.11 కోట్లు ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే బ్యాంకు ఖాతాల్లో తన పేరిట రూ.5.97 కోట్లు, భార్య పేరిట రూ.5.90 కోట్లు ఉన్నాయన్నారు. తన భార్య పిల్లలకు కలిపి రూ.6.86 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు తెలిపారు. అయితే గుంటూరు జిల్లాలో రూ.2.67 కోట్ల విలువైన వ్యవసాయ భూమి, కృష్ణా జిల్లాలో తన భార్య పేరిట 2.33కోట్ల విలువైన వ్యవసాయ భూమి ఉందన్నారు.

AP Elections: పవన్ ప్రాణాలకు ముప్పు.. ఇవిగో సాక్ష్యాలు

అలాగే హైదరాబాద్‌లో 28.10 కోట్ల విలువైన వ్యవసాయేతర భూములు ఉన్నాయని వివరించారు. అమెరికాలో రూ.6.82 కోట్ల విలువైన వ్యవసాయేతర భూములు... హైదరాబాద్‌లో రూ. 29.73 కోట్ల విలువైన వాణిజ్య భవనం ఉందన్నారు. అలాగే దేశ రాజదాని ఢిల్లీలో రూ.72కోట్ల విలువైన భవనం, తన భార్య పేరిట రూ.34.82 కోట్ల నివాస భవనం, అమెరికాలో రూ.28. 26 కోట్ల విలువైన నివాస భవనాలు ఉన్నాయని పెమ్మసాని తన అపిడవిట్‌లో వివరించారు.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 22 , 2024 | 07:17 PM