Share News

TDP: సోషల్ మీడియా ధాటికి తట్టుకోలేక పాలిటిక్స్‌కు టీడీపీ నేత గుడ్‌బై

ABN , Publish Date - Feb 16 , 2024 | 04:12 PM

Andhrapradesh: సోషల్ మీడియా పోస్టింగ్స్ ధాటికి తట్టుకోలేక విసుకు చెందిన ఓ టీడీపీ నేత రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు. నూజివీడు మాజీ ఎఎంసీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు రాజకీయాల నుండి నిష్క్రమిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు.

TDP:  సోషల్ మీడియా ధాటికి తట్టుకోలేక పాలిటిక్స్‌కు టీడీపీ నేత గుడ్‌బై

ఏలూరు, ఫిబ్రవరి 16: సోషల్ మీడియా పోస్టింగ్‌ల ధాటికి తట్టుకోలేక విసుగు చెందిన ఓ టీడీపీ నేత రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు. నూజివీడు మాజీ ఎఎంసీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు రాజకీయాల నుండి నిష్క్రమిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. గత కొన్ని రోజులుగా తనపై అసభ్య పదజాలంతో నిరాధార వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వ్యక్తులను అదుపు చెయ్యలేని టీడీపీ ముఖ్య నాయకులతో రాజకీయ స్నేహాబంధం కొనసాగించలేనని కాపా తేల్చిచెప్పేశారు. అభిమానులతో చర్చించి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టుగా కాపా శ్రీనివాసరావు వెల్లడించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 16 , 2024 | 04:27 PM