Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Somireddy Chandramohan Reddy: ఇసుక రీచుల్లో దోపిడీ చేస్తున్నారు..

ABN , Publish Date - Mar 03 , 2024 | 07:05 PM

ఇసుక రీచుల్లో వైసీపీ నాయకులు దోపిడీలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పొదలకూరు, ఇరువురు ఇసుక రీచుల్లో అనుమతులు లేకుండా దోపిడీ చేస్తున్నారని చెప్పారు.

Somireddy Chandramohan Reddy: ఇసుక రీచుల్లో  దోపిడీ చేస్తున్నారు..

నెల్లూరు: ఇసుక రీచుల్లో వైసీపీ నాయకులు దోపిడీలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పొదలకూరు, ఇరువురు ఇసుక రీచుల్లో అనుమతులు లేకుండా దోపిడీ చేస్తున్నారని చెప్పారు. వరదపురంలో అక్రమ మైనింగ్ కాకణి అండదండలతో వందల కోట్ల దోపిడీ జరుగుతోందన్నారు. కాకణి రెండుసార్లు గెలిచి సర్వేపల్లిని ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.

తాను రెండు సార్లు ఓడిపోయినా కూడా సర్వేపల్లికి కoడలేరులో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు అందించామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సిమెంట్ రోడ్లు, తాగునీరు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు గుర్తు చేశారు. ఐరన్ లెగ్ కాకణి మంత్రి అయ్యాక.. నెల్లూరులో వైసీపీ కాళీ అయ్యిందన్నారు. మరో నెల రోజుల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుందని.. భూ రీసర్వే క్యాన్సిల్ చేయిస్తామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 07:05 PM