Share News

Kanna Laxminarayana: బ్రిటీష్ వారికంటే దారుణంగా జగన్...

ABN , Publish Date - Feb 03 , 2024 | 03:03 PM

Andhrapradesh: బ్రిటీష్ వారికంటే దారుణంగా సీఎం జగన్ రెడ్డి తయారయ్యారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వ్యాపారం పేరుతో భారత్‌కు వచ్చి, సొంత సైన్యం ఏర్పాటు చేసుకొని బ్రిటీష్ వారు మొత్తం దేశాన్ని ఆక్రమించి ఇక్కడి సంపద కొల్లగొట్టారన్నారు.

Kanna Laxminarayana: బ్రిటీష్ వారికంటే దారుణంగా జగన్...

అమరావతి, ఫిబ్రవరి 3: బ్రిటీష్ వారికంటే దారుణంగా సీఎం జగన్ రెడ్డి (CM Jagan Reddy) తయారయ్యారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Former Minister Kanna Laxminarayana) విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వ్యాపారం పేరుతో భారత్‌కు వచ్చి, సొంత సైన్యం ఏర్పాటు చేసుకొని బ్రిటీష్ వారు మొత్తం దేశాన్ని ఆక్రమించి ఇక్కడి సంపద కొల్లగొట్టారన్నారు. అదే విధంగా జగన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చాక ఎలాగైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని గత ఎన్నికల్లో నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పారన్నారు. మోసపు హామీలతో ఒక్క ఛాన్స్ అని ప్రజల్ని నమ్మించి, ముఖ్యమంత్రి అయ్యాక వారి తలల మీద కూర్చున్నారని మండిపడ్డారు.

తన అధికారం, సంపదలో వాటా అడుగుతారని ఆఖరికి సొంత తల్లి, చెల్లిని కూడా తరిమేశారన్నారు. తండ్రి తర్వాత తండ్రి అయిన బాబాయ్‌ను చంపించడానికి కూడా వెనుకాడలేదన్నారు. భారతదేశంలో తానే గొప్ప ధనవంతుడిని కావాలన్న తన కోరికను నెరవేర్చుకోవడానికి రాష్ట్రాన్ని లూఠీ చేశారని ఆరోపించారు. జగన్ రెడ్డి విచ్చలవిడి దోపిడీ, అధికారం తలకెక్కిన అహంకారంతో వైసీపీ నేతలు పక్కచూపులు చూస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీచేయడానికి ఎవరూ దొరక్క జగన్ రెడ్డి తన పార్టీని మూసేసి రాష్ట్రం విడిచి పారిపోవడం ఖాయమని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 03 , 2024 | 03:43 PM