Share News

AP Politics: మంత్రి బొత్స సత్యనారాయణకు గట్టి ఎదురుదెబ్బ

ABN , Publish Date - Apr 10 , 2024 | 09:03 PM

సొంత ఇలాకా చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక నేతలు వైసీపీని వీడారు. మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కోట్ల కుటుంబం, మాజీ ఎంపీపీ మోతిలాల్ నాయుడు కూడా పార్టీ మారారు.

AP Politics: మంత్రి బొత్స సత్యనారాయణకు గట్టి ఎదురుదెబ్బ
Shock To Andhra Pradesh Minister Botsa Satya Narayana

విజయనగరం: సొంత ఇలాకా చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణకు (Botsa Satya Narayana) గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక నేతలు వైసీపీని వీడారు. మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో (TDP) చేరారు. మాజీ ఎమ్మెల్యే కోట్ల కుటుంబం, మాజీ ఎంపీపీ మోతిలాల్ నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు పార్టీ మారిన వారిలో ఉన్నారు. మెరకముడిదాం మండలంలో 300 కుటుంబాలు వైసీపీని వీడారు. అందరిని కళా వెంకట్రావు, స్థానిక నేతలు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ సొంత నియోజకవర్గంలో మంత్రి బొత్సకు షాక్ తగిలినట్టయ్యింది. పార్టీ మారిన శ్రేణులతో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలం మరింత పెరిగినట్టు అవుతుందని టీడీపీ నేతలు అంటున్నారు.


ఇవి కూడా చదవండి:

Telangana: మెదక్‌లో కాంగ్రెస్ సమావేశం.. బీఆర్‌ఎస్‌పై మంత్రి కొండా సంచలన వ్యాఖ్యలు..

AP Politics: సర్వేపల్లిలో మితిమీరిన మంత్రి కాకాణి అల్లుడు ఆగడాలు: మాజీమంత్రి సోమిరెడ్డి

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Apr 10 , 2024 | 09:03 PM