AP Politics: 7 నుంచి వారాహి వాహనంపై పవన్ కల్యాణ్ ప్రచారం
ABN , Publish Date - Mar 28 , 2024 | 07:28 PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజీగా ఉన్నారు. ప్రాంతాలవారీగా పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఏప్రిల్ 7వ తేదీన పెందుర్తిలో వారాహి వాహనంలో ప్రచారం చేస్తారు. పవన్ కల్యాణ్ పర్యటన వివరాలను పెందుర్తి సుజాతనగర్ జనసేన కార్యాలయంలో ఆ పార్టీ నేత పంచకర్ల రమేష్ బాబు తెలియజేశారు.
విశాఖ: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బిజీగా ఉన్నారు. ప్రాంతాలవారీగా పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఏప్రిల్ 7వ తేదీన పెందుర్తిలో వారాహి వాహనంలో ప్రచారం చేస్తారు. పవన్ కల్యాణ్ పర్యటన వివరాలను పెందుర్తి సుజాతనగర్ జనసేన కార్యాలయంలో ఆ పార్టీ నేత పంచకర్ల రమేష్ బాబు తెలియజేశారు. పెందుర్తిలో పవన్ కల్యాణ్తో పాటు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నేతలు కూడా వారాహి వాహనం నుంచి అభివాదం చేస్తారు. బహిరంగ సభ పెందుర్తి లేదంటే వేపగుంటలో నిర్వహించే అవకాశం ఉంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి:
AP Politcis: ఏపీ సీఎం జగన్ 3 వేల వాయిదాలు కోరారు: రఘురామ సంచలనం