Share News

Chandrababu Prajagalam Live Updates: కావలి ప్రజాగళం సభలో జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు

ABN , First Publish Date - Mar 29 , 2024 | 05:04 PM

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేడు (శుక్రవారం) తొమ్మిది మంది అసెంబ్లీ అభ్యర్థులతో జాబితాను విడుదల చేసిన టీడీపీ ప్రచారంలోనూ దూసుకెళ్తోంది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం ప్రజాగళం పేరిట ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. కావలి ప్రజాగళం బహిరంగ సభలో అధికార వైసీపీ, సీఎం జగన్‌పై చంద్రబాబు విరుచుకుపడ్డారు.

Chandrababu Prajagalam Live Updates: కావలి ప్రజాగళం సభలో జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు

Live News & Update

  • 2024-03-29T17:24:58+05:30

    ఏపీలో ప్రజలకు రక్షణ లేదు: చంద్రబాబు

    • ఎవరు పేదవారో.. ఎవరు పెత్తందారో.. ప్రజలు తెలుసుకోవాలి

    • అధికార అహంకారంతో అన్న క్యాంటీన్లు రద్దు చేశారు

    • ఐదేళ్లుగా టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా పేదలను వేధించారు

    • ఇప్పుడున్న ఇంటి కాలనీలన్నీ ఉంటాయి.. వేటినీ రద్దు చేయం

    • నిర్మాణంలో ఉన్న అన్ని ఇళ్లనూ పూర్తి చేస్తాం

    • పిల్లలు, యువతు భవిష్యత్‌కు గ్యారంటీ నాది

    • జగన్‌ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు

    Untitled-4.jpg

  • 2024-03-29T17:20:38+05:30

    ఏపీలో స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదు: చంద్రబాబు

    • కొన్ని వందల కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి

    • ఈ ముఖ్యమంత్రిని రాజకీయాల్లో లేకుండా చేయాలి

  • 2024-03-29T17:19:45+05:30

    ఇలాంటి సీఎం వస్తాడని ఎప్పుడూ ఊహించలేదు: చంద్రబాబు

    • జగన్‌ను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధమయ్యారు

    • జగన్‌కు వ్యవస్థలపై విశ్వాసం లేదు

    • పేటీఎం బ్యాచ్‌లను పెట్టుకుని మాపై బురద చల్లుతున్నారు

    • ఎవరైనా రోడ్డు మీదకు వచ్చి పోరాడాలి

  • 2024-03-29T17:18:25+05:30

    మీ పిల్లల భవిష్యత్‌ బాధ్యత నేను తీసుకుంటా: చంద్రబాబు

    • ఎన్టీఆర్‌.. టీడీపీ ప్రారంభించిన గొప్ప రోజు ఇది

    • ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందించిన రోజు ఇది

    • తెలుగుజాతిని ప్రపంచానికి పరిచయం చేశాం

    • తెలుగు యువత ప్రపంచ దేశాలకు వెళ్లి రాణిస్తున్నారు

    • ఐదేళ్లుగా ఏపీ యువత అనేక కష్టాలు పడుతున్నారు

  • 2024-03-29T17:17:16+05:30

    ప్రజలను చైతన్యం చేసేందుకే నేను వచ్చా: చంద్రబాబు

    • రైతులకు సాగునీరు లేదు.. గిట్టుబాటు ధర రావడం లేదు

    • యువతకు జాబు రావాలంటే.. బాబు రావాలి

    • ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎన్డీఏ గెలుపు ఖాయమని తెలుస్తోంది

    • వైసీపీ నేతలకు డిపాజిట్లు కూడా గల్లంతవుతాయి.

  • 2024-03-29T17:06:14+05:30

    జగన్‌ను ఇంటికి పంపడానికి ఏపీ ప్రజలు సిద్ధమయ్యారు: చంద్రబాబు

    • ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎవరైనా రోడ్డు మీదకు వచ్చి మాట్లాడగలిగారా?

    • ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులు వస్తారు.. కేసులు పెడతారు

    • జైల్లో పెడతారు.. టార్చర్ చేస్తారు

    • చంపడానికి కూడా కొంతమంది పోలీసులు వెనుకాడలేదు

  • 2024-03-29T17:02:36+05:30

    ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేడు (శుక్రవారం) తొమ్మిది మంది అసెంబ్లీ అభ్యర్థులతో జాబితాను విడుదల చేసిన టీడీపీ ప్రచారంలోనూ దూసుకెళ్తోంది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం ప్రజాగళం పేరిట ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. కావలి ప్రజాగళం బహిరంగ సభలో అధికార వైసీపీ, సీఎం జగన్‌పై చంద్రబాబు విరుచుకుపడ్డారు.