Share News

Amalapuram: అమెరికా నుంచి అమలాపురానికి చేరుకున్న రోడ్డు ప్రమాద మృతదేహాలు

ABN , Publish Date - Jan 02 , 2024 | 01:27 PM

కోనసీమ జిల్లా: అమెరికా నుంచి అమలాపురానికి రోడ్డు ప్రమాద మృతదేహాలు మంగళవారం చేరుకున్నాయి. టెక్సాస్‌లో ఇటీవల ట్రక్కు ఢీకొని ఐదుగురు దుర్మరణం చెందారు. వారంతా ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులు. ఎమ్మెల్యే చిన్నాన్న, చిన్నమ్మ, వాళ్ళ కుమార్తె, మనవడు, మనవరాలు...

Amalapuram: అమెరికా నుంచి అమలాపురానికి చేరుకున్న రోడ్డు ప్రమాద మృతదేహాలు

కోనసీమ జిల్లా: అమెరికా నుంచి అమలాపురానికి రోడ్డు ప్రమాద మృతదేహాలు మంగళవారం చేరుకున్నాయి. టెక్సాస్‌లో ఇటీవల ట్రక్కు ఢీకొని ఐదుగురు దుర్మరణం చెందారు. వారంతా ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులు. ఎమ్మెల్యే చిన్నాన్న, చిన్నమ్మ, వాళ్ళ కుమార్తె, మనవడు, మనవరాలు...

ఎమ్మెల్యే చిన్నాన్న పొన్నాడ నాగేశ్వరరావు(68) చిన్నమ్మ సీతా మహాలక్ష్మి (65), కుమార్తె నవీన (38), మనవడు కృతిక్ (11), మనవరాలు నిషిధ (9).. అమలాపురం హౌసింగ్ బోర్డులో ఉంటున్న ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటికి మృతదేహాలు చేరాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలను చూసి ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ వెక్కి వెక్కి ఏడ్చారు.

ఐదు రోజుల క్రితం అమెరికా టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘనలో అమలాపురానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు దుర్మరణం చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ సొంత బంధువులుగా గుర్తించారు. మృతులు ఎమ్మెల్యే సతీష్‌ చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబసభ్యులు. నాగేశ్వరరావు చిన్న కుమార్తె నవీన గంగ, అల్లుడు లోకేష్‌తో పాటు ఇద్దరు పిల్లలు టెక్సాస్‌లో ఉంటున్నారు. 6 నెలల క్రితం అమలాపురం వచ్చిన కుమార్తె నవీనతో కలిసి తండ్రి నాగేశ్వరరావు, తల్లి సీతామహాలక్ష్మి టెక్సాస్‌కు పయనమయ్యారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో నాగేశ్వరరావు, సీతామహాలక్ష్మి, కుమార్తె నవీనతో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందగా.. నాగేశ్వరరావు అల్లుడు లోకేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కుటుంబసభ్యుల మృతితో అమలాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - Jan 02 , 2024 | 01:27 PM