YCP: వైసీపీకి గుడ్ బై చెప్పనున్న దొరబాబు..!
ABN , Publish Date - Jan 12 , 2024 | 07:39 AM
వైసీపీకి పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దొరబాబుకు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. నేడు పుట్టినరోజు పేరుతో అనుచరులతో దొరబాబు భారీ సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
![YCP: వైసీపీకి గుడ్ బై చెప్పనున్న దొరబాబు..!](https://media.andhrajyothy.com/media/2023/20231205/Whats_App_Image_2024_01_12_at_7_44_13_AM_d77b763547.jpeg)
కాకినాడ: వైసీపీకి పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దొరబాబుకు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. నేడు పుట్టినరోజు పేరుతో అనుచరులతో దొరబాబు భారీ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. స్వాగత ఫ్లెక్సీలు కటౌట్లో ఎక్కడా వైసీపీ జెండా కానీ.. జగన్ ఫోటో కానీ లేకుండా సిద్ధం చేయించారు. దీంతో దొరబాబు త్వరలో పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. ఈ రోజు రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం ప్రకటిస్తారా అనే దానిపై నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. దొరబాబుకు ఎమ్మెల్యే టికెటును నిరాకరించి ఆ స్థానంలో ఇన్చార్జిగా కాకినాడ ఎంపీ గీతను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఇవాళ పుట్టిన రోజు వేడుకలో దొరబాబు.. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు భారీగా విందు ఏర్పాటు చేస్తున్నారు.