Share News

Devineni Uma: కనీసం గుంతలు పూడ్చలేనివాడు ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:59 PM

కనిగిరిలో పెద్ద బహిరంగ సభతో ఎన్నికల శంఖారావాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పూరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీన తిరువూరు పట్టణంలో జరిగే బహిరంగ సభకు మైలవరం నలుమూలల నుంచి 40 వేల మంది తరలి రాబోతున్నారన్నారు.

Devineni Uma: కనీసం గుంతలు పూడ్చలేనివాడు ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు

విజయవాడ: కనిగిరిలో పెద్ద బహిరంగ సభతో ఎన్నికల శంఖారావాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పూరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీన తిరువూరు పట్టణంలో జరిగే బహిరంగ సభకు మైలవరం నలుమూలల నుంచి 40 వేల మంది తరలి రాబోతున్నారన్నారు.

ఎన్టీఆర్ వర్ధంతి జనవరి 18వ తేదీన గుడివాడలో ప్రతిష్టాత్మకంగా జరగబోతోందని దేవినేని ఉమ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అవినీతిని ఎండగట్టాలన్నారు. కనీసం గుంతలు పూడ్చలేనివాడు ప్రభుత్వాన్ని నడుపుతున్నాడన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన సైనికులు తిరువూరు బహిరంగ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని దేవినేని ఉమ పేర్కొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 12:59 PM