Share News

Devineni Uma: అడ్డగోలు ఇసుక తవ్వకాలతో వేల కోట్లు బొక్కేసిన వైసీపీ నేతలు

ABN , Publish Date - Feb 15 , 2024 | 01:30 PM

రాష్ట్రంలో అడ్డగోలు ఇసుక తవ్వకాలతో వైసీపీ నేతలు వేల కోట్లు బొక్కేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. మొదటి రెండేళ్లు అస్మదీయ కంపెనీకి అప్పగించడం జరిగిందన్నారు.

Devineni Uma: అడ్డగోలు ఇసుక తవ్వకాలతో వేల కోట్లు బొక్కేసిన వైసీపీ నేతలు

అమరావతి: రాష్ట్రంలో అడ్డగోలు ఇసుక తవ్వకాలతో వైసీపీ నేతలు వేల కోట్లు బొక్కేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. మొదటి రెండేళ్లు అస్మదీయ కంపెనీకి అప్పగించడం జరిగిందన్నారు. మూడేళ్లుగా తమ్ముడు కనుసన్నల్లో అక్రమ దందా నడుస్తోందన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా నదీగర్బాలను అణువణువునా భారీ మెషీన్లతో తోడేశారని దేవినేని ఉమ పేర్కొన్నారు. ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై దాడులకు తెగబడ్డారన్నారు. టీడీపీ హయాంలో ఇచ్చిన ఉచిత ఇసుకను రద్దు చేశారన్నారు. పేదలకు ఇసుక అందుబాటులో లేకుండా చేసిన జగన్ అక్రమ మైనింగ్‌తో తాడేపల్లి ఖజానా నింపుకున్నారని దేవినేని ఉమ పేర్కొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 01:31 PM