Share News

AP News: దళిత జడ్జి రామకృష్ణ నివాసంపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

ABN , Publish Date - May 01 , 2024 | 07:16 AM

అన్నమయ్య జిల్లాలోని మండల కేంద్రమైన బి. కొత్తకోటలో దళిత జడ్జి రామకృష్ణ నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇంటి తలుపులు, కిటికీలు, కారు అద్దాలు ధ్వంసం చేశారు. వేట కొడవళ్లు చేతిలో పట్టుకొని దుండగులు వచ్చినట్టు రామకృష్ణ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయినా పోలీసులు స్పందించడం లేదు. గతంలోనూ అనేక సార్లు ఆయన ఇంటి పైన ఆయన పైన వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.

AP News: దళిత జడ్జి రామకృష్ణ నివాసంపై  గుర్తు తెలియని వ్యక్తుల దాడి

అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లాలోని మండల కేంద్రమైన బి. కొత్తకోటలో దళిత జడ్జి రామకృష్ణ నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇంటి తలుపులు, కిటికీలు, కారు అద్దాలు ధ్వంసం చేశారు. వేట కొడవళ్లు చేతిలో పట్టుకొని దుండగులు వచ్చినట్టు రామకృష్ణ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయినా పోలీసులు స్పందించడం లేదు. గతంలోనూ అనేక సార్లు ఆయన ఇంటి పైన ఆయన పైన వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. పెద్దిరెడ్డి కుటుంబం అరాచకాలపై గతంలో రామకృష్ణ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. గత కొంతకాలంగా సమస్య సద్దుమనిగినట్టు అనిపించింది. అయితే మళ్లీ ఇప్పుడు దాడులతో అలజడి చెలరేగుతోంది.

ఉద్యోగాలు ఇవ్వలేనివాడు నాయకుడా?

Read Latest AP News and Telugu News

Updated Date - May 01 , 2024 | 07:16 AM