Share News

ఇండియా కూటమి పీఠమెక్కడం ఖాయం: సీపీఐ

ABN , Publish Date - Jun 02 , 2024 | 06:33 AM

పదేళ్లు పూర్తయినా రాష్ట్ర విభజన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం విజయవాడలోని దాసరి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న

ఇండియా కూటమి పీఠమెక్కడం ఖాయం: సీపీఐ

అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): పదేళ్లు పూర్తయినా రాష్ట్ర విభజన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం విజయవాడలోని దాసరి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరేంద్ర మోదీ ఎన్ని డ్రామాలాడినా మళ్లీ ప్రధాని కాలేరని, జూన్‌ 4న వెలువడే ఎన్నికల ఫలితాలతో దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం తథ్యమని, ఏపీకి ప్రత్యేక హోదా ఇండియా కూటమితోనే సాధ్యమని రామకృష్ణ అన్నారు.

Updated Date - Jun 02 , 2024 | 06:53 AM