Share News

Chandrababu: చిత్తూరు జిల్లాలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన..

ABN , Publish Date - Feb 06 , 2024 | 07:46 AM

అమరావతి: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. చిత్తూరు పార్లమెంట్‌లోని జి.డి. నెల్లూరులో ‘ రా కదలి రా’ సభలో పాల్గొననున్నారు. ఈ రోజుతో 20 పార్లమెంట్ స్థానాల పరిధిలో రా కదలి రా సభల నిర్వహణ పూర్తికానుంది.

Chandrababu: చిత్తూరు జిల్లాలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన..

అమరావతి: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. చిత్తూరు పార్లమెంట్‌లోని జి.డి. నెల్లూరులో ‘ రా కదలి రా’ సభలో పాల్గొననున్నారు. ఈ రోజుతో 20 పార్లమెంట్ స్థానాల పరిధిలో రా కదలి రా సభల నిర్వహణ పూర్తికానుంది.

చంద్రబాబు టూర్ షెడ్యూల్ ఇదే..

గంగాధర నెల్లూరు సమీపం రామానాయుడుపల్లె బస్టాప్‌ వద్ద మంగళవారం జరిగే ‘రా.. కదలిరా’ బహిరంగ సభ కోసం చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 2.50 గంటలకు రామానాయుడుపల్లె హెలిప్యాడ్‌కు వస్తారు. అక్కడ్నుంచి 3 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు బహిరంగసభ జరుగుతుంది. అనంతరం 4.35 గంటలకు 4.45 రామానాయుడుపల్లె హెలిప్యాడ్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 5.10 గంటలకు విమానంలో విజయవాడకు బయలుదేరుతారు.

వైసీపీ దౌర్జన్యాలను, బెదిరింపులు, కేసులను ఎదుర్కొంటూ జిల్లాలో తెలుగుదేశం పార్టీ మళ్లీ మహాశక్తిగా ఆవిర్భవిస్తోంది. ప్రజల్లో జగన్‌రెడ్డి ప్రభుత్వంపై పెరుగుతున్న ఆగ్రహం, అసంతృప్తి తెలుగుదేశం శ్రేణులకు మరింత శక్తిని ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు గంగాధరనెల్లూరులో చంద్రబాబునాయుడు బహిరంగ సభ జరగనుంది. ప్రజల సంక్షేమానికి హామీలూ, పార్టీ కార్యకర్తలకు భరోసా ఈ వేదిక మీదనుంచి చంద్రబాబు బలంగా ప్రకటిస్తారని భావిస్తున్నారు.

Updated Date - Feb 06 , 2024 | 07:46 AM