Share News

Kanna Lakshminarayana: అంబటి రాంబాబు ప్రోత్సాహంతోనే పీఆర్ఓపై దాడి

ABN , Publish Date - Jan 29 , 2024 | 07:42 AM

ముప్పాళ్ళ మండలం తొండపి లో గాయపడిన పీఆర్ఓ స్వామిని టీడీపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి అంబటి రాంబాబు ప్రోత్సాహంతో దాడి చేశారని పేర్కొన్నారు.

Kanna Lakshminarayana: అంబటి రాంబాబు ప్రోత్సాహంతోనే పీఆర్ఓపై  దాడి

పల్నాడు: ముప్పాళ్ళ మండలం తొండపి లో గాయపడిన పీఆర్ఓ స్వామిని టీడీపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి అంబటి రాంబాబు ప్రోత్సాహంతో దాడి చేశారని పేర్కొన్నారు. గంజాయి తాగి దాడికి పాల్పడ్డారన్నారు. కరెంట్ తీసి రాళ్లతో ఊరేగింపుపై దాడికి వైసీపీ గుండాలు పాల్పడ్డారని కన్నా పేర్కొన్నారు. తమపై హత్యా ప్రయత్నానికి పాల్పడ్డారన్నారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగిందన్నారు. దేవుని దయవల్ల చిన్న గాయాలతో బయటపడ్డామన్నారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని.. పోలీసులు చర్యలు తీసుకోవాలని కన్నా పేర్కొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 11:29 AM