Share News

Araku: ప్రధాని జన్ మన్ కార్యక్రమానికి అరకులో ఏర్పాట్లు పూర్తి..

ABN , Publish Date - Jan 14 , 2024 | 09:25 PM

ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్న జన్ మన్ కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Araku: ప్రధాని జన్ మన్ కార్యక్రమానికి అరకులో ఏర్పాట్లు పూర్తి..

ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్న జన్ మన్ కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 15 సోమవారం అరకులోయ మండలం కొత్తబల్లగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఈ కార్యక్రమం జరగనుంది. స్థానిక గిరిజనులతో వర్చువల్ విధానంలో ప్రధాని సంభాషించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ (పీఎం జన్మన్) పథకాన్ని వర్చువల్ విధానంలో ప్రధాని ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

దేశ వ్యాప్తంగా 100 జిల్లాలు పాల్గొననున్న ఈ కార్యక్రమంలో ఆరు జిల్లాల పీవీటీజీలతో ప్రధాని మాట్లాడతారు. ఈ మేరకు అరకులో జరిగే కార్యక్రమ ఏర్పాట్లను పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో వర్చువల్ విధానంలో ప్రధానితో సంభాషించేందుకు ఆదివాసీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - Jan 14 , 2024 | 09:25 PM