Atchannaidu: 2047 నాటికి అభివృద్ధి భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్..
ABN , Publish Date - Feb 01 , 2024 | 04:43 PM
Andhrapradesh: 2047 నాటికి అభివృద్ధి భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉందని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై అచ్చెన్న మాట్లాడుతూ...
![Atchannaidu: 2047 నాటికి అభివృద్ధి భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్..](https://media.andhrajyothy.com/media/2023/20231205/atchannaidu_jagan_d84cc340fe.jpg)
అమరావతి, ఫిబ్రవరి 1: 2047 నాటికి అభివృద్ధి భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉందని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) అన్నారు. గురువారం లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై అచ్చెన్న మాట్లాడుతూ... మౌళిక రంగానికి, స్కిల్ ఇండియాకు కేంద్ర తోడ్పాటును స్వాగతిస్తున్నామన్నారు. విభజనచట్టం హామీల అమలుకు నిధులు సాధించడంలో జగన్ మరోమారు విఫలమయ్యారని విమర్శించారు. వైసీపీకి 31 మంది ఎంపీలు ఉన్నా ఉపయోగం శూన్యమన్నారు. స్వాంత్రంత్య్రం సాధించి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకునే సమయానికి దేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేలా కేంద్ర బడ్జెట్ ఉందని చెప్పుకొచ్చారు. బడ్జెట్ నిర్ణయాలు ఆ లక్ష్యసాధన దిశగా ఉన్నాయన్నారను. మౌళిక రంగానికి, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడం మంచి పరిణామమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...