Share News

Andhra Pradesh: శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు

ABN , Publish Date - Jun 02 , 2024 | 05:42 AM

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి, జస్టిస్‌ ఏవీ శేషసాయి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Andhra Pradesh: శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు

తిరుమల, జూన్‌1(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి, జస్టిస్‌ ఏవీ శేషసాయి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లిన వీరు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం వీరు రంగనాయక మండపానికి చేరుకోగా వేదపండితులు ఆశీర్వదించారు. అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. జస్టిస్‌ శేషసాయి ఆదివారం పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు.

Updated Date - Jun 02 , 2024 | 05:42 AM