Share News

AP Assembly: చివరిరోజు ఆలస్యంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలు.. కారణమిదే!

ABN , Publish Date - Feb 08 , 2024 | 09:29 AM

Andhrapradesh: చివరి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. కోరం లేని కారణంగా సమయానికి అసెంబ్లీ ప్రారంభం కాని పరిస్థితి. సభా సమయానికి ప్రారంభం కాలేదని టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. కోరం లేకపోవడం ఘోరం అంటూ అసెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యేల కామెంట్లు చేశారు.

AP Assembly: చివరిరోజు ఆలస్యంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలు.. కారణమిదే!

అమరావతి, ఫిబ్రవరి 8: చివరి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. కోరం లేని కారణంగా సమయానికి అసెంబ్లీ ప్రారంభం కాని పరిస్థితి. సభా సమయానికి ప్రారంభం కాలేదని టీడీపీ ఎమ్మెల్యేలు (TDP MLAs) అభ్యంతరం తెలిపారు. కోరం లేకపోవడం ఘోరం అంటూ అసెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యేలు కామెంట్లు చేశారు.

సభ మొదలైన వెంటనే...

గురువారం ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన వెంటనే ముందుగా స్పీకర్ తమ్మినేని సీతారాంకు (Speaker Tammineni Seetharam) టీడీపీ , వైసీపీ ఎమ్మెల్యేలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆపై జాబ్ క్యాలెండర్‌పై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోదయం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. దీంతో సభళో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లుకు సవరణలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రతిపాదించారు.

టీ బ్రేక్..

ఆడబిడ్డల మంగళసూత్రాలు తాకట్టు పెట్టిన జగన్ డౌన్ డౌన్ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. గంజాయి రాష్ట్రంగా మార్చిన జగన్ అంటూ పెద్దపెట్టున నిరసన తెలిపారు. దీనిపై ఆర్థిక మంత్రి బుగ్గన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సభలో టీడీపీ సభ్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు అధికారపక్షం వైపు నుంచి ఎమ్మెల్యే తక్కువగా సభకు హాజరయ్యారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 08 , 2024 | 09:38 AM