Share News

PM Modi: శ్రీ సత్యసాయి జిల్లాలో నేడు ప్రధాని మోదీ పర్యటన

ABN , Publish Date - Jan 16 , 2024 | 06:59 AM

శ్రీ సత్యసాయి జిల్లా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధాని రానున్న నేపథ్యంలో ఏపీ గవర్నర్ నజీర్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలకనున్నారు.

 PM Modi: శ్రీ సత్యసాయి జిల్లాలో నేడు ప్రధాని మోదీ పర్యటన

శ్రీ సత్యసాయి జిల్లా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధాని రానున్న నేపథ్యంలో ఏపీ గవర్నర్ నజీర్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనకు స్వాగతం పలకనున్నారు. ఈ సందర్భంగా సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం, పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్(నాసిన్) సెంటర్‌ను నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. అలాగే లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

మోదీ పర్యటన షెడ్యూల్...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మధ్యాహ్నం 1.30 ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకొని...అక్కడి నుంచి హెలికాప్టర్లో వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం 3.30 గంటలకు సత్యసాయి జిల్లాలోని పాలసముద్రానికి వెళ్లి నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్(నాసిన్) సెంటర్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ట్రైనీ ఐఆర్ఎస్‌లతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. అళాగే భూటాన్‌కు చెందిన రాయల్ సివీల్ సర్వీస్ విభాగ ఆఫీసర్ ట్రైనీస్‌తో కూడా ప్రధాని మోదీ ముచ్చటిస్తారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో సీఎం జగన్ పర్యటన..

Updated Date - Jan 16 , 2024 | 07:01 AM