Share News

Parital Sriram: ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రజల్లోకి పరిటాల శ్రీరామ్

ABN , Publish Date - Jan 04 , 2024 | 11:51 AM

Andhrapradesh: ప్రజా చైతన్య యాత్ర పేరుతో ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్ః ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం ధర్మవరం మున్సిపల్ పరిధిలోని గుట్టుకిందపల్లి నుంచి పరిటాల శ్రీరామ్ పాదయాత్రను ప్రారంభించారు.

Parital Sriram: ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రజల్లోకి పరిటాల శ్రీరామ్

శ్రీ సత్యసాయి జిల్లా, జనవరి 4: ప్రజా చైతన్య యాత్ర పేరుతో ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్ (Paritala Sriram) ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణియించారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం ధర్మవరం మున్సిపల్ పరిధిలోని గుట్టుకిందపల్లి నుంచి పరిటాల శ్రీరామ్ యాత్రను ప్రారంభించారు. ధర్మవరం పట్టణంలో ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా ఐదు రోజుల పాటు 40 వార్డుల్లో పాదయాత్ర సాగనుంది. చేనేత వర్గంతో పాటు వివిధ సామాజిక వర్గాలు సమస్యలు శ్రీరామ్ తెలుసుకోనున్నారు. పాదయాత్రలో వచ్చిన సమస్యలపై ధర్మవరం పట్టణంపై మినీ మేనిఫెస్టోను రూపొందించనున్నారు. పరిటాల శ్రీరామ్ చేపట్టిన పాదయాత్రకు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 04 , 2024 | 11:51 AM