Share News

TDP: పరిటాల శ్రీరామ్ కోసం రోడ్డెక్కిన తెలుగు తమ్ముళ్లు

ABN , Publish Date - Mar 16 , 2024 | 01:01 PM

శ్రీ సత్యసాయి జిల్లా: మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ కోసం తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. ధర్మవరం టీడీపీ అభ్యర్థిగా శ్రీరామ్‌ను ప్రకటించాలంటూ ఆయన అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.

TDP: పరిటాల శ్రీరామ్ కోసం రోడ్డెక్కిన తెలుగు తమ్ముళ్లు

శ్రీ సత్యసాయి జిల్లా: మాజీ మంత్రి (Ex Minister) పరిటాల సునీత (Paritala Sunitha) కుమారుడు పరిటాల శ్రీరామ్ (Paritala Sriram) కోసం తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. ధర్మవరం (Dharmavaram) టీడీపీ అభ్యర్థిగా (TDP Candidate) శ్రీరామ్‌ను ప్రకటించాలంటూ ఆయన అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు భారీ ర్యాలీ (Rally) నిర్వహించారు. ధర్మవరం నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు (Activists) వేలాదిగా తరలివచ్చారు. టీడీపీ ఇంచార్జ్‌గా నేతలు, కార్యకర్తలను కాపాడుకున్న పరిటాల శ్రీరామ్‌కు టికెట్ కేటాయిస్తే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామంటూ నినాదాలు చేశారు. ధర్మవరం పట్టణంలోని ప్రధాన వీధుల్లో శ్రీరామ్‌కు మద్దతుగా టీడీపీ నేతలు, కార్యకర్తల ర్యాలీ సాగింది.

Updated Date - Mar 16 , 2024 | 01:01 PM