Share News

YCP: పెనుకొండ వైసీపీలో ముదిరిన విభేదాలు

ABN , Publish Date - Jan 19 , 2024 | 08:13 AM

శ్రీ సత్యసాయి జిల్లా: పెనుకొండ నియోజకవర్గం వైసీపీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే శంకర్ నారాయణను మంత్రి ఉషశ్రీ చరణ్ టార్గెట్ చేశారు. ప్రారంభోత్సవాలు, శిలాఫలకాల్లో ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఫోటో కనిపించకూడదంటూ మంత్రి హుకుం జారీ చేశారు.

YCP: పెనుకొండ వైసీపీలో ముదిరిన విభేదాలు

శ్రీ సత్యసాయి జిల్లా: పెనుకొండ నియోజకవర్గం వైసీపీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే శంకర్ నారాయణను మంత్రి ఉషశ్రీ చరణ్ టార్గెట్ చేశారు. ప్రారంభోత్సవాలు, శిలాఫలకాల్లో ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఫోటో కనిపించకూడదంటూ మంత్రి హుకుం జారీ చేశారు. దీంతో అధికారులు మంత్రి ఆదేశాలతో ఆగమేఘాలపై శంకర్ నారాయణ ఫోటోపై సీఎం జగన్ స్టిక్కర్ వేశారు. అనంతరం తుంగోడు గ్రామ సచివాలయాన్ని ఉషశ్రీ చరణ్ ప్రారంభించారు. కాగా పెనుకొండ వైసీపీ ఇన్చార్జిగా మంత్రి ఉషశ్రీ చరణ్‌ను ఎమ్మెల్యే శంకర్ నారాయణ వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో పెనుకొండ వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ముదురుతున్నాయి.

Updated Date - Jan 19 , 2024 | 08:13 AM