Share News

AP News: మేదరమెట్ల వద్ద ఎమర్జెన్సీ రన్ వేపై మరికాసేపట్లో ట్రయల్ రన్

ABN , Publish Date - Mar 18 , 2024 | 10:53 AM

మేదరమెట్ల వద్ద ఎమర్జెన్సీ రన్ వేపై ఈ రోజు ఎయిర్ ఫోర్స్ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. విపత్తుల సమయంలో వినియోగించేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మేదరమెట్ల, సింగరాయకొండ వద్ద రెండు ఎమర్జెన్సీ రన్ వేలను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది.

AP News: మేదరమెట్ల వద్ద ఎమర్జెన్సీ రన్ వేపై మరికాసేపట్లో ట్రయల్ రన్

బాపట్ల: మేదరమెట్ల వద్ద ఎమర్జెన్సీ రన్ వే (Emergency Run way)పై ఈ రోజు ఎయిర్ ఫోర్స్ అధికారులు (Airforce Officials) ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. విపత్తుల సమయంలో వినియోగించేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మేదరమెట్ల, సింగరాయకొండ వద్ద రెండు ఎమర్జెన్సీ రన్ వేలను కేంద్ర ప్రభుత్వం (Central Government) నిర్మించింది. గత ఏడాది మేదరమెట్ల వద్ద రన్ వే పై నాలుగు కార్గో విమానాలు (Cargo Flights), ఒక జెట్ విమానం (Jet Flight)తో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. రన్ వే పై దిగకుండా 100 మీటర్ల ఎత్తులో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మరో సారి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. రన్ వే పై కార్గో, జెట్ విమానాలు దిగనున్నాయి. ట్రయల్ రన్ కోసం 16వ నంబర్ జాతీయ రహదారిపై పోలీసులు ట్రాఫిక్ మళ్ళించారు.

AP News: 33 మంది వలంటీర్ల తొలగింపు.. కారణమేంటో తెలిస్తే..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 18 , 2024 | 10:59 AM