Home » Bapatla
బాపట్ల: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం చీరాలలో పర్యటించనున్నారు. సాయంత్రం 3 గంటలకు చీరాలలో జరిగే ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు.
ఏపీ ఎన్నికల (AP Election 2024) ముందు ఏపీ పోలీసుల (AP Police) కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొన్ననే అధికార వైసీపీకి సహకరిస్తున్నారనే విషయంపై ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసిన విషయం తెలిసిందే.
సోమవారం అర్ధరాత్రి పోలీసులు(AP Police) బాపట్ల జిల్లా(Bapatla) మేదరమెట్ల గ్రామంలో ప్రజలను భయభ్రాంతులను చేశారు. ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలు, 10 మంది ఎస్ఐలు, 50 మందికిపై పోలీస్ సిబ్బంది, ఫ్లైయింగ్ స్క్వాడ్తో గ్రామంలోని ఓ టీడీపీ(TDP) కార్యకర్త ఇంటిని చట్టుముట్టారు. గోడలు దూకి, తలుపులు బాదుతూ హంగామా సృష్టించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నిక ( AP Election 2024)ల్లో తెలుగుదేశం - జనసేన - బీజేపీ పొత్తులు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తుడంటంతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గెలుపు వ్యూహాలపై పదును పెట్టారు. ఇందులో భాగంగానే బాపట్ల పార్లమెంట్లోని అసెంబ్లీ అభ్యర్థులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సమావేశానికి కూటమి నేతలు కూడా హాజరయ్యారు.
బాపట్ల జిల్లా: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలు, రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజాగళంలో భాగంగా శుక్రవారం ఆయన బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. వేమూరు, రేపల్లె నియోజకవర్గాలలో ప్రజాగళం సభలు నిర్వహిస్తారు.
బాపట్ల: వైసీపీ ఎంపీ నందిగం సురేష్ కు ఘోర పరాభవం ఎదురైంది. ‘అంతా మా ఇష్టం.. మాకు ఎలక్షన్ కోడ్ వర్తించదు’ అన్న రీతిలో ప్రచారాన్ని నిర్వహించిన ఎంపీ సురేష్కు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఎదురైంది.
బాపట్ల జిల్లా: బల్లికురవలో ఓ పోలీస్ అధికారి రెచ్చిపోయాడు. ఓ వృద్ధిడిపై ఝులుం ప్రదర్శించాడు. శానంపూడి హనుమంతురావు అనే వృద్ధిడిపై బల్లికురవ ఎస్ఐ శివనాగిరెడ్డి దాడి చేశాడు. వృద్ధుడు బల్లికురవలో బడ్డీకొట్టు నడుపుకుంటున్నాడు. మద్యం అమ్ముతున్నాడని ఆరోపిస్తూ...
మేదరమెట్ల వద్ద ఎమర్జెన్సీ రన్ వేపై ఈ రోజు ఎయిర్ ఫోర్స్ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. విపత్తుల సమయంలో వినియోగించేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మేదరమెట్ల, సింగరాయకొండ వద్ద రెండు ఎమర్జెన్సీ రన్ వేలను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది.
గుంటూరు జిల్లా: తెనాలిలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగిన భర్త, భార్య, కుమార్తె. ఈ ఘటనలో భార్య నాగమణి మృతిచెందగా.. భర్త శివ శంకర్రావు , కుమార్తె హారిక. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
జిల్లాలోని మేదరమెట్ల వైసీపీ(YSRCP) సిద్దం సభా ప్రాంగణం వద్ద తొక్కిసలాట జరిగింది. వేదిక వద్ద నుంచి సీఎం జగన్ రెడ్డి (CM Jagan) వెళ్లిపోయిన తర్వాత ఒక్కసారిగా బయటకు వచ్చేందుకు వైసీపీ కార్యకర్తల యత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా, మరొకరికి అస్వస్థతకు గురయ్యారు.