Home » Bapatla
యూరియాను వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. యూరియా కొరత లేదని, ఎక్కడా అధిక ధలు చెల్లించాల్సిన అవసరం లేదంటూ అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు చెబుతున్న మాటలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయి.
ఒకవైపు తుఫాన్ హెచ్చరికలతో.. పొలాల్లో హార్వెస్టర్లు పరుగులు పెడుతున్నాయి. రాత్రి పగలు విరామం లేకుండా కోత కోసేస్తున్నాయి. కోసిన ధాన్యం కల్లాలపై ఆరబెట్టే పనికూడా లేకుండా అన్నదాతలు వ్యాపారులకు అమ్మేస్తున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో రెండు, మూడు రోజుల నుంచి ఈ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ధాన్యం కొనుగోళ్లను సులభతరం చేసే దిశగా ప్రభుత్వం సాంకేతిక సేవలను ఉపయోగించుకునే విధానానికి తెరతీసింది. రైతుల కోసం వాట్సాప్ నెంబర్ను అందు బాటులోకి తెచ్చింది. 7337359375 నంబ రుకు హాయ్ అని మెసేజ్ పెడితే చాలు వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ వాయిస్తో తదుపరి ప్రక్రియపై రైతులకు మార్గనిర్దేశనం చేస్తుంది.
పట్టణాల్లో వీధి కుక్కలు ఇంకా రోడ్లపై గుంపులుగా చేరి మొరుగుతూనే ఉన్నాయి. జనం పిక్కల బలానికి పరీక్షలు పెడుతూనే ఉన్నాయి. కుక్కకాటుతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్యలో పెద్దగా మార్పేమీ కనిపించడం లేదు.
బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గుంటూరు వైపు వెళ్తున్న బైక్.. లారీని ఢీకొన్న ఈ దుర్ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిని కర్లపాలెం వాసులుగా తెలిపారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ బంధువులుగా పేర్కొన్నారు. ఎమ్మెల్యే కుమారుడి సంగీత్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా మార్టూర్ మండలం కొల్లపూడి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుక్కను తప్పించబోయిన కారు డివైడర్ను బలంగా ఢీకొట్టింది.
వినాయక చవితిని అట్టహాసంగా జరుపుకోవాలని స్నేహితులతో కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పూజకు అవసరమైన కలువ పూల కోసం వెళ్లి చెరువులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటనతో పండుగవేళ బుధవారం బాపట్ల మండలం పూండ్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
బల్లికురవ సమీపంలోని ఓ గ్రానైట్ క్వారీలో ప్రమాదం చోటు చేసుకుంది. క్వారీ అంచు విరిగిపడి ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతులను ఒడిశా వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో క్వారీలో 16 మంది పనిచేస్తున్నట్లు సమాచారం.
బాపట్ల జిల్లా బల్లికురవలోని గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది. రాళ్లు విరిగిపడి నలుగురు కార్మికులు మృతి చెందారు.