Share News

AP News: ’సిద్ధం‘ సభలో తొక్కిసలాట.. ఒకరి మృతి

ABN , Publish Date - Mar 10 , 2024 | 09:16 PM

జిల్లాలోని మేదరమెట్ల వైసీపీ(YSRCP) సిద్దం సభా ప్రాంగణం వద్ద తొక్కిసలాట జరిగింది. వేదిక వద్ద నుంచి సీఎం జగన్ రెడ్డి (CM Jagan) వెళ్లిపోయిన తర్వాత ఒక్కసారిగా బయటకు వచ్చేందుకు వైసీపీ కార్యకర్తల యత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా, మరొకరికి అస్వస్థతకు గురయ్యారు.

AP News: ’సిద్ధం‘ సభలో తొక్కిసలాట.. ఒకరి మృతి

బాపట్ల: జిల్లాలోని మేదరమెట్ల వైసీపీ(YSRCP) ’సిద్ధం‘ సభా ప్రాంగణం వద్ద తొక్కిసలాట జరిగింది. వేదిక వద్ద నుంచి సీఎం జగన్ రెడ్డి (CM Jagan) వెళ్లిపోయిన తర్వాత ఒక్కసారిగా బయటకు వచ్చేందుకు వైసీపీ కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా, మరొకరు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఒంగోలు బలరాం కాలనీకి చెందిన మురళీ‌గా గుర్తించారు.

మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కి తరలించారు. కాగా ఈ ఘటనతో మృతిచెందిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టినట్టు సమాచారం. ఈ విషయం ప్రతిపక్ష నేతలకు తెలియడంతో వారు కుటుంబ సభ్యులను పరామర్శించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 10 , 2024 | 09:45 PM