Road Accidents: రెండు వేర్వేరు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు..
ABN , First Publish Date - 2023-06-11T08:46:33+05:30 IST
వరంగల్: రెండు వేర్వేరు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఒక వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ప్రమాదంలో లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కోగా.. క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
వరంగల్: రెండు వేర్వేరు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఒక వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ప్రమాదంలో లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కోగా.. క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే...
వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం, కొలాన్ పల్లి శివారులో గాలిదుమారానికి చెట్టు విరిగి రోడ్డుపై పడింది. అది గమనించకుండా ఓ ఆటో స్పీడ్గా దూసుకెళ్లి.. చెట్టును బలంగా ఢీ కొంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ కుమార్ (50) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కామారెడ్డి జిల్లా: పెద్ద కొడప్ గల్ మండలం, జగనాథ్ పల్లి, 161 జాతీయ రహదారిపై లారీ అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ లారీ క్యాబిన్లో ఇరుక్కోగా.. క్లీనర్ స్వల్ప గాయలతో బయటపడ్డాడు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు, అంబులెన్సు సిబ్బంది క్రైన్ సహాయంతో డ్రైవర్ను బయటకు తీసారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులు మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన సతీష్, అభిజిత్లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.