Bhupalpally: వరంగల్ ప్రీతి ఘటన మరువక ముందే మరో విషాదం..

ABN , First Publish Date - 2023-02-27T00:42:44+05:30 IST

యువకుడి వేధింపులు, అస భ్యకర మెసేజ్‌లతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇంజనీరిం గ్‌ విద్యార్థిని ఆదివారం వరంగల్‌లోని రామన్నపేటలో ఆ త్మహత్యకు పాల్పడింది.

Bhupalpally: వరంగల్ ప్రీతి ఘటన మరువక ముందే మరో విషాదం..

మట్టెవాడ: యువకుడి వేధింపులు, అస భ్యకర మెసేజ్‌లతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆదివారం వరంగల్‌లోని రామన్నపేటలో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం. భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన పబ్బోజు శంకర్‌, రమా దేవి కూతురు పబ్బోజు రక్షిత (20) వరంగల్‌ నర్సంపేటలోని ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. హనుమకొండ కిషన్‌ పురాలోని ఓ హాస్టల్‌లో ఉంటూ కాలేజ్‌ బస్‌లో నిత్యం కాలేజీ వెళ్లి వస్తుండేది. రక్షిత తండ్రి వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

భూపాలపల్లికి చెందిన పరిచయమున్న యువకుడు ప్రేమ పేరుతో వేధింపులు, సెల్‌ఫోన్‌లో అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టడంతో రక్షిత తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో శనివారం వరంగల్‌ రామన్నపేటలోని బంధువుల (వరుసకు బాబాయి)ఇంటి కి తల్లితో రక్షిత వచ్చింది. ఆదివారం సాయంత్రం బాత్‌ రూంలో వెళ్లి.. బయటకు రాకపోగా అనుమానించి ఇంట్లోని వారు లోపలికి వెళ్లి చూడగా.. ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే అంబులెన్స్‌లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, చికిత్స అందిస్తుండగానే మృతి చెందింది.

కొంత కాలంగా రక్షితను యువకుడు వేధిస్తుండడంతో ఈనెల 22న ఇంట్లో నుంచి ఎటో వెళ్లిపోయింది. దీంతో భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసుకూడా నమో దైంది. కేసు నమోదైన రెండురోజుల తర్వాత రక్షిత భూ పాలపల్లిలోని ఇంటికి చేరింది. భూపాలపల్లికి చెందిన యువకుడిపై యువకుడిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్టు మట్టెవాడ పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-02-27T08:19:55+05:30 IST