Food Poison.. హనుమకొండ జిల్లా: ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో ఫుడ్ పాయిజన్..

ABN , First Publish Date - 2023-07-17T16:28:47+05:30 IST

హనుమకొండ జిల్లా: కాజీపేట మండలం, భట్టుపల్లి ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత 32 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Food Poison.. హనుమకొండ జిల్లా: ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో ఫుడ్ పాయిజన్..

హనుమకొండ జిల్లా: కాజీపేట మండలం, భట్టుపల్లి ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో (SR Prime School) ఫుడ్ పాయిజన్ (Food Poison) కలకలం రేపింది. నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత 32 మంది విద్యార్థులు (32 Students) అస్వస్థతకు గురయ్యారు. ఫాదర్ కొలంబో ఆసుపత్రిలో 16 మంది, జయ ఆసుపత్రిలో 16 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సగానికిపైగా విద్యార్థులు హాస్టల్‌ను ఖాళీ చేశారు. అయితే ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ యాజమాన్యం దీనిపై నోరుమెదపడంలేదు. మీడియాను కాలేజీ లోపలకు రానీయకుండా గేట్లు మూసివేశారు. అసలు కాలేజీ లోపల ఏం జరుగుతుందో అర్థంకావడంలేదు. వంటగదిలో అపరిశుభ్రవాతావరణం, పాడైన చికెన్ తెచ్చి వండిపెట్టడంవలనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

Updated Date - 2023-07-17T16:28:47+05:30 IST