Vijayashanthi: కిషన్ రెడ్డి సభలో 'ఆయన' ఉండడంతో ఇంటికొచ్చేసిన విజయశాంతి

ABN , First Publish Date - 2023-07-21T19:21:57+05:30 IST

బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యులు, మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డిపై (Kiran Kumar Reddy) మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanthi) విమర్శ‌లు గుప్పించారు.

Vijayashanthi: కిషన్ రెడ్డి సభలో 'ఆయన' ఉండడంతో ఇంటికొచ్చేసిన విజయశాంతి

హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యులు, మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డిపై (Kiran Kumar Reddy) మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanthi) విమర్శ‌లు గుప్పించారు. కిర‌ణ్ కుమార్ రెడ్డిపై విజ‌య‌శాంతి పరోక్షంగా ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించిన వారు స్టేజీపై ఉన్నారు. తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రయత్నించిన వారూ అక్క‌డ ఉన్నారు. తెలంగాణ వ్య‌తిరేకులు అక్కడ ఉండటంతో అసౌకర్యంగా ఫీల్ అయ్యా. అక్క‌డ చివ‌రి వ‌ర‌కు ఉండ‌టం అసాధ్యం. అందుకే కార్య‌క్ర‌మం ముగియ‌క‌ముందే వెల్లిపోవాల్సి వ‌చ్చింది." అని విజ‌య‌శాంతి పేర్కొన్నారు.

Updated Date - 2023-07-21T19:21:57+05:30 IST