దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఫలితాలు చేరికలతో వచ్చాయా..?: హరీష్‌కు రాములమ్మ సూటి ప్రశ్న

ABN , First Publish Date - 2023-05-31T13:17:58+05:30 IST

చిట్‌చాట్‌లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఏదో చెప్పారని.. దాన్ని బట్టి తమ పార్టీలోకి చేరికలు ఉండబోవంటున్న ఆర్థిక మంత్రి హరీష్‌రావుకు బీజేపీ నాయకురాలు విజయశాంతి సూటి ప్రశ్న వేశారు. నాటి దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఫలితాలు చేరికలతో వచ్చాయా? ప్రజల విజ్ఞాన నిర్ణయంతో వచ్చాయా...! అని ప్రశ్నించారు.

దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఫలితాలు చేరికలతో వచ్చాయా..?: హరీష్‌కు రాములమ్మ సూటి ప్రశ్న

హైదరాబాద్ : చిట్‌చాట్‌లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఏదో చెప్పారని.. దాన్ని బట్టి తమ పార్టీలోకి చేరికలు ఉండబోవంటున్న ఆర్థిక మంత్రి హరీష్‌రావుకు బీజేపీ నాయకురాలు విజయశాంతి సూటి ప్రశ్న వేశారు. నాటి దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఫలితాలు చేరికలతో వచ్చాయా? ప్రజల విజ్ఞాన నిర్ణయంతో వచ్చాయా...! అని ప్రశ్నించారు. ‘‘బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల చేతులెత్తేశారు, చిట్ చాట్‌లో ఈటల చెప్పారు.. చేరికలు ఇక లేవు అంటున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు.. నాటి ఆ దుబ్బాక, జీహెచ్ఎంసీ, నిన్నటి ఎమ్మెల్సీ ఫలితాలు చేరికలతో వచ్చాయా...! చేరికల కమిటీతో వచ్చాయా..? ప్రజల విజ్ఞాన నిర్ణయంతో వచ్చాయా...! విశ్లేషించుకోవాలి. బీజేపీని నిరంతరం గెలిపిస్తున్నది ప్రాణమిచ్చే కార్యకర్తల త్యాగాలు, బీజేపీని నమ్మే ప్రజల విశ్వాసాలు, రక్తమిచ్చే హైందవ ధర్మశ్రేణుల పోరాటాలు మాత్రమే. చేరికల కమిటీ పేరు చెప్తూ, చిట్ చాట్‌లను ప్రస్తావిస్తూ మీరు చేస్తున్న బీజేపీ వ్యతిరేక విమర్శల ప్రచారం ఎన్నటికి నిలవదు. ఇది హరీష్ రావు గారికి తెలవంది కాదు’’ అని రాములమ్మ పేర్కొన్నారు.

Updated Date - 2023-05-31T13:17:58+05:30 IST