Vijayashanthi: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి మార్పు లీకేజీలపై విజయశాంతి ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-06-11T21:49:03+05:30 IST

తెలంగాణ బీజేపీ (BJP) అధ్యక్ష పదవి మార్పుపై మీడియాలో ప్రచారం అవుతున్న లీకేజీలపై బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు.

Vijayashanthi: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి మార్పు లీకేజీలపై విజయశాంతి ఏమన్నారంటే..

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ (BJP) అధ్యక్ష పదవి మార్పుపై మీడియాలో ప్రచారం అవుతున్న లీకేజీలు సరికాదని, బీజేపీలో వార్తలు లీక్ చేసే పద్ధతి ఉండదని బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) అన్నారు. సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతారని తరుణ్ చుగ్ గతంలో చెప్పిన విషయాన్ని విజయశాంతి గుర్తు చేశారు.

సోషల్ మీడియాలో రాములమ్మ పెట్టిన పోస్ట్ యథాతథంగా.. 'బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి మార్పు పై మీడియా లీకేజీలు సరి కాదు... బీజేపీలో వార్తలు లీక్ చేసే పద్ధతి ఉండదు. సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ బండి సంజయ్ గారు కొనసాగుతారని తరుణ్ చుగ్ గారు గతంలో చెప్పిన అంశం మాత్రమే ఇప్పటికీ అధికార పూర్వకం. నేతల భేటీలపై ఊహాగానాలతో వెలువడే మీడియా కథనాలు, సమాచారం ఎప్పటికీ అధికార ప్రకటనలు కానే కావు. వీటి ప్రభావం పార్టీపైనా, ప్రజల్లోనూ ఉండదు. పార్టీ అధికార ప్రతినిధుల నుంచి మాత్రమే కచ్చితమైన సమాచారం లేదా ప్రకటన వస్తుంది. ఎవరికైనా అదే అధికారికం అవుతుంది తప్ప ఊహాజనిత వార్తలు కాదు.' అని విజయశాంతి అన్నారు.

Updated Date - 2023-06-11T21:59:08+05:30 IST