Share News

Road Accident: మొయినాబాద్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2023-11-25T11:33:34+05:30 IST

Telangana: జిల్లాలోని మొయినాబాద్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Road Accident: మొయినాబాద్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి: జిల్లాలోని మొయినాబాద్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న మహ్మద్ గౌస్ అక్కడికక్కడే మృతి చెందగా.. అబ్దుల్ రహీమ్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేతిరెడ్డి పల్లిలో ఉన్న ఫ్యాన్ షాప్ కట్టేసి ఇంటికి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహ్మద్ గౌజ్, అబ్దుల్ రహీమ్ ఇద్దరు స్నేహితులుగా తెలుస్తోంది.

Updated Date - 2023-11-25T11:34:20+05:30 IST