Share News

TS News: వడ్డీ వ్యాపారి ఇంటిపై ముగ్గురు మహిళల దాడి

ABN , Publish Date - Dec 21 , 2023 | 11:04 AM

Telangana: జిల్లాలోని దోమకొండలో వడ్డీ వ్యాపారి ఇంటిపై మహిళల దాడి చేశారు. కాశీనాథ్ అనే వ్యాపారి వద్ద కామారెడ్డికి చెందిన కవిత రూ.5 లక్షల అప్పు తీసుకుంది.

TS News: వడ్డీ వ్యాపారి ఇంటిపై ముగ్గురు మహిళల దాడి

కామారెడ్డి: జిల్లాలోని దోమకొండలో వడ్డీ వ్యాపారి ఇంటిపై మహిళల దాడి చేశారు. కాశీనాథ్ అనే వ్యాపారి వద్ద కామారెడ్డికి చెందిన కవిత రూ.5 లక్షల అప్పు తీసుకుంది. అప్పులో కొంత భాగం చెల్లించి మిగతా అప్పు కొరకు చెక్కులు రాసి ఇచ్చింది. చెక్కులు బౌన్స్ కేసులతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వ్యాపారి కాశీనాథ్ ఇంట్లోకి చొచ్చుకొని వెళ్లి కవిత గొడవకు దిగింది. స్నేహితులైన సరిత, సానియాలతో పెప్పర్ స్ప్రే కొట్టి కాశీనాథ్ భార్య భువనేశ్వరిపై ముగ్గురు మహిళలు దాడికి పాల్పడ్డారు. భువనేశ్వరి మెడలో నుంచి 2 తులాల బంగారు గొలుసు లాక్కున్నారని పారిపోతున్న ముగ్గురు మహిళలను గ్రామస్తులు చితకబాదారు. ఆపై ఆ ముగ్గురు మహిళలను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 21 , 2023 | 11:04 AM